GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఆగస్ట్ -21(అక్షరం న్యూస్ ) ఎరువుల విక్రయాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (ఎఫ్ ఎఫ్ ఎస్ ) యాప్ ఆగస్టు 21, 2026 నుంచి అందుబాటులోకి వచ్చిందని ముస్తాబాద్ మండల వ్యవసాయ అధికారి అనూష తెలిపారు. ఇకపై యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్ని రకాల ఎరువులను ఈ సెంట్రల్ యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని ఆమె సూచించారు. రైతులు ఆధార్ లేదా రైతు రిజిస్ట్రేషన్ ఐడీ ద్వారా ఎరువులను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. యాప్లో లాగిన్ కావడానికి ప్రతి రైతు ముందుగా రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడంతో పాటు, రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసిన మొబైల్ నంబర్నే ఉపయోగించాలి అని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తి కాని రైతులు వెంటనే ఏఈఓలను లేదా మీ-సేవ కేంద్రాలను సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు. రైతులు తమ మొబైల్లోని ప్లేస్టోర్లో “ఎఫ్ ఎఫ్ ఎస్ ” అని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎరువుల బుకింగ్ను సెంట్రల్ యాప్ ద్వారానే చేసుకోవాలని ఆమె సూచించారు
.
Aksharam Telugu Daily