GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : * రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /మార్చి -04(అక్షరం న్యూస్ ) ఎస్ఈ బి . బిక్షపతి ఆదేశాల మేరకు గంభీరావుపేట మండలంలోని ముస్తాబాద్ సెక్షన్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ ఉద్యోగులు, ఓ అండ్ ఎం సిబ్బందితో వేసవి కార్యాచరణ, వ్యవసాయ సర్వీసుల మంజూరు, విద్యుత్ భద్రతపై సిరిసిల్ల డివిజన్ ఇంజనీర్ అంజయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ ఇంజనీర్ అంజయ్య మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో లోడ్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడం, ప్రమాదభరితంగా ఉన్న లైన్లను గుర్తించి మరమ్మతులు చేయడం, వంగిన విద్యుత్ స్థంభాలను తక్షణమే మార్చడం వంటి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించే ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని, హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్ రాడ్ వంటి భద్రతా పరికరాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు చేయరాదని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రామీణ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు (ఏ జి ఎల్ ) పెండింగ్లో ఉన్న సేవలను త్వరితగతిన విడుదల చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంభీరావుపేట ఏ.డి.ఈ శ్రీనివాస్ , ఏ.ఈ విష్ణు తేజ , ఓ అండ్ ఎం సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily