P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి అక్టోబర్ 30 (అక్షరం న్యూస్) శుక్రవారం ఉదయం ఓదెల గ్రామంలో 2 కిలోమీటర్ల రన్నింగ్ కు యువత భారీ ఎత్తున పాల్గొనాలని ఎస్సై దీకొండ రమేష్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గురువారం అక్షరం ప్రతినిధితో మాట్లాడుతూ పోత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివస్ - 2025’ ను పురస్కరించుకొని పోత్కపల్లి పోలీసు విభాగం ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించనున్నట్లు ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా 2 కిలోమీటర్ల రన్ ఉదయం 6:00 గంటలకు ఓదెల జగదాంబ సెంటర్ నుండి ఒర్రెగడ్డ వరకు నిర్వహించబడుతుంది. దేశ ఐక్యత, సమగ్రత, సోదరభావాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజలందరూ, మరియు యువత, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది, అన్ని సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎస్సై రమేష్ పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో ఏకత అత్యవసరం. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానేత స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ రన్ ఫర్ యూనిటీ లో భాగస్వామ్యం అవ్వాలి అని ఆయన పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily