GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మార్చి 18(అక్షరం న్యూస్ ) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న 6 వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నాగారం రోడ్డులో గల బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ అధికారం ఉన్న లేక పోయిన హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం బొమ్మ వెంకన్న ఎంతో కృషి చేశారని అన్నారు. పార్టీలకతీతంగా బొమ్మ వెంకన్నకు అభిమానులను ఉన్నారన్నారు. గెలుపోటములు కాకుండా ప్రజలకు సేవా చెయ్యాలని బొమ్మ వెంకన్న అనేవారని తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. హుస్నాబాద్ శాసన సభ్యుడిగా బిసి రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత మన ప్రాంతానికి దక్కిందన్నారు. బొమ్మ వెంకన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily