D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 19( అక్షరం న్యూస్) ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదులాపురంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 365.55 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధికార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. కూసుమంచి 100 పడకల ఆసుపత్రి, ఏదులాపురం నర్సింగ్ కళాశాల, మద్దులపల్లి నూతన మార్కెట్ యార్దులను ప్రారంభించి నర్సింగ్ విద్యార్థులతో కలసి ముచ్చటించారు. విద్య, వైద్యం, సాగునీరు ప్రాధాన్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపెందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily