GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/డిసెంబర్-02(అక్షరం న్యూస్) ముస్తాబాద్ మండలం లో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజా వాతావరణం ప్రశాంతంగా కొనసాగడం, అనవసర గుమికూడడం నివారించడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిసెంబర్ 01 నుంచి డిసెంబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 నిబంధనలు అమల్లో ఉంటాయని ముస్తాబాద్ ఎస్ ఐ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ముస్తాబాద్ మండల పరిధిలో ఎవరైనా ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ స్థాయి సమావేశాలు నిర్వహించడం కఠినంగా నిషేధమని తెలిపారు. ప్రజా జీవనాన్ని అంతరాయం కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకైనా చోటిలేదు” అని స్పష్టం చేశారు. అలాగే “30 పోలీస్ యాక్ట్” ఉల్లంఘనలకు చట్టంలో స్పష్టమైన శిక్షలు ఉన్నాయని తెలిపారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై ఎటువంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ప్రజల భద్రత కోసం పెట్టబడ్డాయని, అందరూ తప్పనిసరిగా పాటించాలి” అని హెచ్చరించారు. ఏ కార్యక్రమం కావాలన్నా ముందుగానే దరఖాస్తు చేసి అనుమతి పొందాలన్నారు. ప్రజల సహకారం వల్లనే శాంతిభద్రతలు నిలుస్తాయని మండల ప్రజలు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని కోరారు. పోలీసుల చర్యలు ప్రజల రక్షణ కోసమేనని ఎస్ ఐ తెలిపారు.
.
Aksharam Telugu Daily