GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /అక్టోబర్ -14(అక్షరం న్యూస్ ) భూ సర్వేకు సంబంధించిన రిపోర్టు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి నుండి 20వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా సిరిసిల్ల సర్వేయర్ వేణును ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇరుకుల ప్రవీణ్ కు చిన్న బోనాలలో 3 ఎకరాల భూమిని సర్వే చేయడం కోసం సర్వేయర్ వేణు 30 వేల రూపాయలు డిమాండ్ చేయగా, బాధితుడు ఇరుకుల ప్రవీణ్ కరీంనగర్ లో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.మొదట సర్వేయర్ కు 10వేల రూపాయలు అప్పజెప్పాడు. తర్వాత పంచనామా సర్టిఫికెట్ కోసం మరో 20వేల రూపాయలు ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు, సర్వేయర్ వేణు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖలో వరుసగా సర్వేయర్ లపై ఏసీబీ దాడులు జరగడం కలకలం రేపుతున్నాయిమొన్న మే నెలలో ఎల్లారెడ్డిపేట సర్వేయర్ పట్టుబడగా, నేడు సిరిసిల్ల సర్వేయర్ వేణు ఏసీబీ ట్రాప్ లో పట్టుబడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు జరుగుతున్నా మరో వైపు పలు డిపార్ట్ మెంట్ ల అధికారుల తీరు మారడం లేదన్న విమర్శలు వస్తున్నాయి
.
Aksharam Telugu Daily