Friday, 19 June 2026 03:35:48 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కూతురు ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచిన సర్పంచ్

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 19 June 2026 01:38 PM Views : 127

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జూన్ -18(అక్షరం న్యూస్ ) పాఠశాలల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో నామపూర్ గ్రామ సర్పంచ్ తన కూతురిని గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. మండల పరిధిలోని నామ పూర్ గ్రామానికి చెందిన మాదాసు అనిల్ ప్రస్తుతం గ్రామ సర్పంచ్ గా ఉన్నారు.తన స్వగ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో శుక్రవారం తన కుమార్తె అభిజ్ఞ ను ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి లొ చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందనే సందేశాన్ని సమాజానికి చాటాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన చర్యను గ్రామస్థులు అభినందిస్తూ, ఇతర తల్లిదండ్రులకు ఇది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారుఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంత రెడ్డీ , ఉపాధ్యాయులు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు . ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇలాంటి చర్యలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు ప్రజా ప్రతి నిధులు ప్రభుత్వ విద్యపై నమ్మకం ఉంచి తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లొ ఉపాధ్యాయులు భాస్కర చారి, భాస్కర్, సుధాకర్, సుధాకర్, సువర్ణ, పీడీ శ్రీనివాస్, నాగేశ్వర్లు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :