GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/మే-31(అక్షరం న్యూస్) భూ సర్వేకు సంబంధించిన రిపోర్టు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది.. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం మల్లేశం అనే రైతు భూమి కొలతల పంచనామ ధ్రువీకరణ పత్రం జారీ కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేయగా, మల్లేశం గతంలో రూ.22 వేల రూపాయలు నాగరాజుకు ఇచ్చాడు. కాగా శనివారం చంద్రంపేట రైతు వేదిక వద్ద మరో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నాగరాజును అధికారులు ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతున్నారు.
.
Aksharam Telugu Daily