AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 22 అక్షరం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "చేయూత" పెన్షన్ పథకం లబ్ధిదారుల ఎంపిక మరియు దరఖాస్తుల ప్రక్రియ పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మున్సిపల్ పరిధిలో మొత్తం 644 దరఖాస్తులను ఆన్లైన్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 31 వరకు గడువు ఉన్నప్పటికీ, చివరి దశలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి, అర్హులైన దరఖాస్తుదారులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనకుండా ఉండేందుకు, ఆగస్టు 25 తేదీలోపు పెన్షన్ దరఖాస్తుకు అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను తమ వార్డు ఆఫీసర్ కు ఇవ్వాలని లేదా మున్సిపల్ కార్యాలయంలో ఇవ్వాలని, తమ దరఖాస్తు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని కోరారు
.
Aksharam Telugu Daily