AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ జిల్లా : వరంగల్/జనవరి 24, (అక్షరం న్యూస్) రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హాజరయ్యారు. అలాగే మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ .భూక్య మురళి నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ , మహాబాద్ డి సి సి అధ్యక్షురాలు భుక్యా ఉమా మురళి, మాజీ డీసీసీ భరత్ చంద్ర రెడ్డి తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ బలంగా పోటీ చేయాలని, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వరంగల్ డిసిసి అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు.
.
Aksharam Telugu Daily