Jakkani Rajaramesh , SIRCILLA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల, జనవరి -22 (అక్షరం న్యూస్): చెక్ బౌన్స్ కేసు విషయంలో వ్యక్తికి సంవత్సరం జైలు శిక్షతో పాటు 2 వేల జరిమానా విధించినట్లు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ గురువారం తీర్పును వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన తాటికొండ శ్రీనివాస్, వోల్లపు బాలయ్యలకు తమ లావాదేవి విషయంలో శ్రీనివాస్ కు బాలయ్య 1,50,000 చెల్లించాల్సింది ఉండగా దానికి బదులుగా అతను 1,50,000 చెక్కును 9-5-2017 నాడు ఇచ్చాడు. శ్రీనివాస్ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్ కాగా దీనిపై శ్రీనివాస్ కేసు వేయగా దీనిపై కోర్టులో సాక్షాధారాలతో విచరణ చేపట్టగా నేడు న్యాయమూర్తి ప్రవీణ్ తుది తీర్పును వెల్లడించారు. చెక్కుపై మరొక లక్ష చేర్చుతూ మొత్తం 2 లక్షల 50 వేలు శ్రీనివాస్ కు చెల్లించాలని, 2 వేల నగదు జరిమానా తో పాటు బాలయ్యకు ఏడాది జైలు శిక్ష విధించినట్లు ప్రకటించారు.
.
Aksharam Telugu Daily