D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 4 (అక్షరం న్యూస్) ప్రజల సమస్యలు వెలికి తీసి పరిష్కరించడంలో మీడియా పాత్ర మరువలేనిదని ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి ధర్మపురి జగదీష్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా అక్షరం దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ దేవబత్తిని సీతారాములు ఆధ్వర్యంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం నందు నూతన సంవత్సర 2026 నూతన క్యాలెండర్ ను జిల్లా రవాణాశాఖ శాఖ అధికారి ధర్మపురి జగదీష్ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు వెతికి తీసి, అధికారులు, ప్రజా ప్రతినిధుల చేత పరిష్కరించడంలో అక్షరం దినపత్రిక మరువలేనిదని ఆయన అన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను అధికారుల పాలకుల దృష్టికి తీసుకోవడంలో మీడియా ఎంతో కాలంగా చాలా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనంతరం దేవబత్తిని సీతారాములు జిల్లా రవాణాశాఖ అధికారి ధర్మపురి జగదీష్, ఆర్టిఏ నెంబర్ గజ్జెల్లి వెంకన్న ఆర్ స్వర్ణలత లకు జ్ఞాపికం అందించి శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ మిత్రులు రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily