AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ జూలై 30 ---- సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న మారుమూల గిరిజన గ్రామం వీరాపురం లో డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం డాక్టర్ నగేష్ వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని దోమ తెరలను వినియోగించాలని అన్నారు. నిల్వ ఉన్న నీటిలో టేమోపాస్ ద్రావణాన్ని చల్లాలని విష జ్వరాలు ప్రబలకుండా వేడి చేసి చల్లార్చిన నీటినే తరచుగా త్రాగాలని గిరిజనులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ వో బాబురావు సబ్ యూనిట్ ఆఫీసర్ ధర్మారావు ఎం టి ఎస్ రామకృష్ణ హెల్త్ అసిస్టెంట్ వేణు ఏ ఎన్ ఎం సమ్మక్క లక్ష్మి ఆశా కార్యకర్త గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily