AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 23/ అక్షరం న్యూస్/ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కల్లూరి వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగిన సిపిఐ నాలుగవ రాష్ట్ర మహాసభల్లో ఎంపిక చేయడం జరిగింది.కల్లూరి ఏజెన్సీ ప్రాంత సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత 2019 ఎన్నికల్లో మహుబూబాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ అధికారుల తీరును ఎండగడుతూ రాజి పడని వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుండి మూడోసారి రాష్ట్ర సమితి సభ్యునిగా ఎన్నికై మరల రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల భద్రాచలం డివిజన్ సమితి పట్టణ సమితి దుమ్ముగూడెం మండల సమితి చర్ల మండల సమితి మరియు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily