Sunday, 29 March 2026 03:26:55 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బ్రేకింగ్ | సూర్యాపేట జిల్లా... అర్వపల్లి 365బి హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒక ఉపాధ్యాయురాలి మృతి

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 17 January 2026 04:57 PM Views : 198

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా అక్షరం ప్రతినిధి తుంగతుర్తి మండలం అర్వపల్లి గ్రామ శివారులోని 365బి హైవేపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ఉపాధ్యాయురాలు మృతి చెందగా, మరో ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా క్షతగాత్రులయ్యారు. నల్గొండలో నివాసం ఉంటూ తుంగతుర్తి మండలంలోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉపాధ్యాయులు ప్రతిరోజూ కారులో పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్కూల్‌కు వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తుంగతుర్తి కస్తూర్బా విద్యాలయ ప్రత్యేక అధికారి కల్పన తీవ్ర గాయాలతో ఘటన స్థలంలోనే మృతి చెందారు. అదే ప్రమాదంలో తుంగతుర్తి మండలం రావులపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు పోరెడ్డి గీత, అన్నారం జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలవాల ప్రవీణ్ కుమార్, తుంగతుర్తి జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు సునీత తీవ్రంగా గాయపడి క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలుసుకున్న అర్వపల్లి ఎస్‌ఐ సైదులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :