SOUDAMALLA. YOHAN Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : * కరీంనగర్/జమ్మికుంట/నవంబర్ 11/అక్షరం న్యూస్: జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాకు సమీపంలో గల వరలక్ష్మి బిర్యాని సెంటర్ పేరుకు మాత్రమే బిర్యాని సెంటర్ గా లోపట మాత్రం బార్లను మరిపించే విధంగా సెట్టింగ్ చేసి హోటల్ యజమాని నడిపిస్తున్న గాని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. అధికారులకు తెలిసే జరుగుతుందా? లేక తెలియదా? పట్టణ ఒడ్డున బార్లను తలపించేలాగా బిర్యానీ సెంటర్ నడిపిస్తున్న కానీ స్థానిక మున్సిపాలిటీ అధికారులు కానీ ఎక్సైజ్ సిబ్బంది గానీ ఎందుకు పట్టించుకోవడంలేదని పలువురు చర్చించుకుంటున్నారు. వరలక్ష్మి బిర్యాని సెంటర్లో చికెన్ ఫ్రై ధర 480 రూపాయలు ఈ ధర బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా లేదని పలువురు చర్చించుకుంటున్నారు. లోపటికి వెళ్తే ఎలాంటి పరిశుభ్రత లేకుండా అశుభ్రత వాతావరణం లో హోటల్ను బార్ లాగా నడిపిస్తున్న కానీ అధికారులు ఎందుకు చూసి చూడనట్టు వివరిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా వరలక్ష్మి బిర్యానీ సెంటర్ పైన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్, స్థానిక ఎక్సైజ్ అధికారులు, మున్సిపాలిటీ అధికారి ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించి వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
.
Aksharam Telugu Daily