AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 30 (అక్షరం న్యూస్ ) సింగరేణి కొత్తగూడెం కార్పోరేట్ పరిధిలో హాస్పటల్ ఏరియా సివిక్ కాంట్రాక్ట్ కార్మికులకు శుక్రవారం నాడు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్- ఏఐటియుసి కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య,ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ క్రిస్టఫర్ ల చేతుల మీదుగా యూనిఫాం దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అడిగిన వెంటనే నాణ్యమైన యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేసిన కాంట్రాక్టర్ శ్రీ వి ఎస్ సాయి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులందరికీ రక్షణతో కూడిన దుస్తులను,రక్షణ పరికరాలను ఎప్పటికప్పుడు అందివ్వాలని కోరారు. వానలకు,ఎండలకు,చలికి, దుమ్ముదులికి గురికాకుండా,అనారోగ్యం పాలు కాకుండా రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ బి మల్సూర్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily