Monday, 15 December 2025 07:10:49 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

యువత రాజకీయాల్లోకి రావాలి .. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి తగిన గుర్తింపు.. నేటితరం యువత చైతన్యం కావాలి ..

తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ పిలుపు


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 24 October 2025 08:15 PM Views : 289

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్/అక్టోబర్ 24 (అక్షరంన్యూస్) రాజకీయంలో రాణించాలనుకునే యువతకు తమ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలుకర రవికుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేసేందుకు కార్యాచరణ రూపొందించామని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం యువతీ యువకులకు కనిపిస్తున్నామని, సర్పంచులుగా, ఎంపీటీసీ, జడ్పిటిసి, ఇతర ఎన్నికల్లో జరిగిన ఆ ఎన్నికలలో పోటీ చేసేందుకు తమ పార్టీ అవకాశం కల్పిస్తుంది అన్నారు. బి ఫామ్ తక్షణమే అందజేసి వాటికి తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ మరింత బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే అనేక జిల్లాలలో పర్యటనలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువ అవుతున్నామని, ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక అయ్యేందుకు తమ పార్టీ మంచి అవకాశాన్ని కల్పిస్తుందని, యువతీ యువకులు రాజకీయ చైతన్యం కలిపినప్పుడే ఈ సమాజం మరింత ముందుకు వెళుతుందని, ప్రజలకు సేవ చేయాలని దృక్పథం కలిగి ఉండాలని అటువంటి వారిని తమ పార్టీ సంపూర్ణంగా ఆహ్వానిస్తుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ స్టార్ క్యాంపినర్, ఐ ఐ ఎస్ రిటైర్డ్ అధికారి కోనప్పరెడ్డి హరిప్రసాద్, పార్టీ రాష్ట్ర నేతలు స్టీవెన్, మేకల సారయ్య, చెరుకూరి రత్నరాజు, జాను ప్రభాకర్, జన్ను జాన్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :