P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి మే 13 (అక్షరం న్యూస్) ఇందిరమ్మ లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం లబ్ధిదారుల కళ్ళల్లో వెల్లువిస్తున్నా ఆనందం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు ఇందిరమ్మ కళ సహకారమే ప్రభుత్వ ధ్యేయం నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని. ప్రభుత్వ విప్. ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు ఈ సందర్భంగా గుండ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి ముఖ్య అతిథులుగా హాజరై గృహప్రవేశాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ఇందిరమ్మ కలల సహకారమే ప్రజా పాలన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో నిర్మించుకున్న లబ్దిదారుల కళ్ళల్లో ఆనందం చూడడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇల్లు లేని అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేసి సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. ప్రజా పాలన భుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని లబ్దిదారులు సకాలంలో ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తే గ్రామాల్లో అర్హులైన వారికి విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తాననిఅన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి పల్లెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అధికారులు ఇండ్లు నిర్మించుకున్న లబ్దిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అదేవిధంగా. అదే గ్రామంలో 20 లక్షలతో గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో. మండల పార్టీ నాయకులు సర్పంచుల ఫోరం అధ్యక్షులు పిట్టల రవికుమార్ ముదిరాజ్ గుండ్లపల్లి సర్పంచ్ పుప్పాల స్వప్న శంకర్ కనగర్తి సర్పంచ్ సొప్పరి సంధ్య కుమార్ ముదిరాజ్ సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రెడ్డి రజనీకాంత్ నాయకులు ఆకుల మహేందర్ చొప్పరి రాజయ్య ముదిరాజ్ తోపాటు వివిధ గ్రామాల నాయకులు ఉప సర్పంచులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily