AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / నవంబర్ 8 / అక్షరం న్యూస్ -: ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింల పట్ల మాట్లాడిన వ్యాఖ్యలు బాగా లేవని, ఆయన అలా అనకుంటే బాగుండేదని రాష్ట్ర మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ముస్లిం ల సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింల పట్ల చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే అని కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉన్నారని కాంగ్రెస్ తోనే ముస్లింలకి మర్యాద దక్కుతుందని కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరని అన్న మాటలు ముస్లిల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తను కూడా కాంగ్రెస్ వాదినేనని కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలో అనేక సెక్యులర్ పార్టీలు ఉన్నాయని దేశ ప్రజల్లో 70% సెక్యులర్ బావ జాలం వారు ఉన్నారని గుర్తు చేశారు. భూమి పుట్టినప్పటినుంచి ముస్లింలు ఉన్నారని, భూమి అంతమయ్యే వరకు ముస్లింలు అల్లాహ్, ప్రవక్త మొహమ్మద్ (స. అ. సం )ను నమ్ముకొని జీవనం సాగిస్తారని నయీమ్ ఖురేషి గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో అమీర్ ఖాద్రి, షమ్మీ, అక్బర్ జాఫర్ ఖురేషి,బాబు జానీ, జమాల్,జుబేద్ ఆలం,ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily