AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 10/ అక్షరం న్యూస్/----- మండల కేంద్రం లోని వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యార్ది నిలయం నందు విద్యనభ్యాసిస్తున్న గిరిజన విద్యార్థులకు హైదరాబాద్ వాస్తవ్యులు తుమ్మలపల్లి స్ఫూర్తి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి వచ్చి ఎంతో పట్టుదలతో విద్యాభ్యాసిస్తున్న గిరి సోదరులకు రాఖీ కట్టడం ఆనందించదగ్గ విషయం అని ఆ చిన్నారి అన్నారు.నేను నీకు రక్షా నీవు నాకు రక్షా మనిద్దరం దేశానికి రక్షా అంటూ అతి పిన్న వయసులోనే సేవా గుణాన్ని ప్రదర్శించన స్ఫూర్తి నీ నిలయ కమిటీ సభ్యులు అభినందించారు. అనంతరం విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. గోగుబాక గ్రామానికి చెందిన సాగి వెంకట జగన్నాదరాజు (నానిబాబు రాజు) విద్యార్దులకు రూ. రెండు వేలు విలువ చేసే యాపిల్స్ బత్తాయి దానిమ్మ, అరటిపండ్లను అందచేశారు. వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత వియ్యంకులు ఆంద్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరు కు చెందిన గుది వెంకట్రావు శ్రీవిద్య దంపతులు విద్యార్దులకు బొప్పాయి అరటిపండ్లు చాక్లెట్లు లను పంపిణీ చేశారు. గిరిజన విద్యార్థులకు దాతలు అందిస్తున్న సహయ సహకారాలకు నిలయ కమిటీ సభ్యులు హృదయ పూర్వక మైన కృతజ్ఞతాభిమానాలు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily