D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ జనవరి 9 (అక్షరం న్యూస్) జిల్లాలో యాసంగి సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేసేందుకు అన్ని మండలాల్లో సమగ్ర చర్యలు చేపట్టామని, ప్రస్తుతం మన జిల్లాలో 10 వేల 942 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, ఇప్పటి వరకు రైతులకు 36 వేల 314 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు కలెక్టర్ తెలిపారు. యూరియా పంపిణీ సంబంధిత అంశాలలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, జిల్లా యంత్రాగం, జిల్లా వ్యవసాయ శాఖ యూరియా సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily