Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పొట్టి శ్రీరాములు /నెల్లూరు : పొట్టి శ్రీ రాములు జిల్లా / నెల్లూరు/ ఏప్రిల్ 13 /అక్షరం న్యూస్ : విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని ఎస్సార్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు..ఈ సందర్భంగా డీజీఎం గోవర్ధన్ రెడ్డి, జెడ్.ఐ శ్రీనివాస్ రెడ్డి, అకాడమిక్ డిన్ రాంబాబు లు ఈ సందర్భంగా మాట్లాడుతూ. అత్యధిక మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు తిసుకోచారన్నారు. `అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిలో మొదటి సంవత్సరం నుండి ఎంపీసీ విభాగంలో ప్రసన్న, సృజన 465, ఎం.వంశీ వర్ధన్ 465 అలాగే 41 మంది విద్యార్థులు 460 పైగా మార్కులు సాధించారు. బైపీసీ విభాగం నుండి ఎస్ కే సుభాని 433 మార్కులు సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఏ నిహారిక 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకు కైవసం చేసుకుంది. ఎం వెంకట యశ్వంత్ 989,ఎన్ తన్మయి 989,అన్వేష్ 988, 30 మంది విద్యార్థులు 980 పైగా మార్కులు సాధించి వారి సత్తా చాటారు. బైపిసి విభాగంలో అబ్దుల్ ఖదీర్ 982 మహబూబ్విష,పలువురు విద్యార్థులు కళాశాలకు మంచి పేరు తిసుకోచారన్నారు. విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలను అభినందిస్తూ ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వారదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, జి.ఏం రాజేంద్రప్రసాద్, డీజిఎం గోవర్ధన్ రెడ్డి, ఎపి డీన్ అరవింద్, జెడ్.ఐ శ్రీనివాస్ రెడ్డి, డిన్ రాంబాబు, ఏ.ఏం.జి వెంకటేశ్వర్లు నాయుడు అలాగే ప్రిన్సిపల్స్ అధ్యాపకులు ప్రత్యేక అభినందనలు విద్యార్థులకు తెలియజేశారు.
-
Aksharam Telugu Daily