AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 2/ అక్షరం న్యూస్:---పేద ఆదివాసీ విద్యార్దులకు వనవాసీ కళ్యాణ పరిషత్ అందచేస్తున్న సేవలు అమోఘమని కొయ్యూరు ప్రాదమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ శ్రీదర్ అన్నారు. శనివారం చర్ల లోని వనవాసీ కొమరం భీం విద్యార్ది నిలయం కు పలువురు దాతలు వితరణ లను అందచేసారు. వనవాసీ కమిటి సభ్యుడు, శ్రీ సీతారామ ఆయిల్ బంక్ మేనేజర్ శివరాజు కిషోర్ - సంతోషి దంపతుల కుమారుడు కార్తికేయ జన్మదినం సందర్భంగా 25 కేజీల బియ్యం, పండ్లు, స్వీట్స్ అందచేసారు. ప్రభుత్వం ఉపాద్యాయుడు శివరాజు రవికుమార్ తన తండ్రి శివరాజు ఆంజనేయులు జ్ఞాపకార్థం విద్యార్థుల వినోదం కొరకు ఏడాది పాటు టివి వీక్షించేందుకు ఎయిర్ టెల్ నెట్వర్క్ రీచార్జ్ చేసారు. ఎలక్ట్రీషియన్ పెదిరెడ్డి రమేష్ జ్ఞాపకార్థం కుమారుడు పెదిరెడ్డి విక్రం కుమార్ - హారిక దంపతులు 50 కేజీల బియ్యం, పండ్ల ను వితరణగా అందజేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన డాక్టర్ శ్రీదర్ మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థుల క్రమశిక్షణ తనను ఎంతో ఆకట్టుకుందని అన్నారు. విద్యార్థులు శ్లోకాలను ఆలపించిన తీరు అమోఘమని ప్రశంసించారు. దాతలు ఇటువంటి పేద విద్యార్దుల అభ్యున్నతి వితరణ లను అందచేయడం అబినందనీయమని అన్నారు. విద్యార్దులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగ పరుచుకొని ఉన్నత స్దితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వనవాసీ నిలయ కమిటీ అద్యక్షుడు తాటి పాపారావు ఉపాద్యక్షులు జవ్వాది మురళీకృష్ణ, కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, శివరాజు కిషోర్ సంతోషి, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి, హెల్త్ సూపర్ వైజర్ రాంప్రసాద్, ఆశా కార్యకర్త ఉషారాణి, పెదిరెడ్డి హారిక పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily