Saturday, 07 February 2026 04:31:17 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రంగు రంగుల కండువాల ‘సొల్లు పురాణం’ నమ్మొద్దు! పదేళ్లు పాలించి ‘పట్టా’ ఇవ్వని దొరలు.. ఇప్పుడు ఓట్ల కోసం వస్తారా? అధికారం మనది.. అభివృద్ధి చేసేది మనమే

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 06 February 2026 06:26 PM Views : 128

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 6 (అక్షరం న్యూస్) ​పాల్వంచ : "ఎన్నికలు రాగానే చుట్టాల్లా వస్తారు.. రంగు రంగుల కండువాలు మార్చి మాయమాటలు చెబుతారు.. పదేళ్లు అధికారంలో ఉండి పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న జ్ఞానం లేని ఆ 'దొర'లు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?" అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్వంచలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగడుతూ వ్యాఖ్యలు చేశారు. కత్తి ఒకరికిచ్చి.. యుద్ధం చేయమంటే కుదురుతుందా? " రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రిగా మీ శీనన్న మీ వారు. కత్తి ఒకరి చేతికి ఇచ్చి, యుద్ధం నన్ను చేయమంటే నేను చేయలేను. ప్రభుత్వం మనదైనప్పుడే అభివృద్ధి సాధ్యం. ఓట్ల కోసం వచ్చే రకరకాల వ్యక్తుల ‘సొల్లు పురాణం’ నమ్మకండి. అధికారం లేని వారికి ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. హస్తం గుర్తును గెలిపిస్తేనే మీ సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను. ​పదేళ్ల అన్యాయానికి చరమగీతం పాడుదాం.. "పదేళ్లుగా నా పేద చెల్లెమ్మలు ఇందిరమ్మ ఇళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఆనాడు పట్టించుకోని వారు, నేడు మీ ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన బ్రిడ్జిలు, అస్తవ్యస్తమైన రోడ్లే వారి అసమర్థతకు సాక్ష్యం. సర్వే నంబర్ 727 భూ సమస్యను ఏళ్ల తరబడి ఎందుకు గాలికొదిలేశారు? మీ ఇంటి పెద్ద కొడుకుగా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, సాగులో ఉన్న ప్రతి నిరుపేదకు పట్టా ఇచ్చే బాధ్యత నాది." ​మాయ మాటలకి కాలం చెల్లింది.. "రంగులు మార్చే నాయకులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. 25 ఏళ్లుగా ఎన్నికల్లేక వెనుకబడ్డ పాల్వంచకు నిధుల ప్రవాహం రావాలన్నా, ఇళ్ల పట్టాలు అందాలన్నా కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షమైన సీపీఎం పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి" అని మంత్రి పిలుపునిచ్చారు.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :