Jakkani Rajaramesh , SIRCILLA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : * అక్షరం ప్రతినిధి సిరిసిల్ల తెలంగాణ శాసనసభలో *అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు ను ఏకగ్రీవంగా* ఆమోదించడం పట్ల *రాజన్న సిరిసిల్ల జిల్లా లీగల్ సెల్ సభ్యులు, వాక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కమిటీ లీగల్ అడ్వైజర్ న్యాయవాది అన్సర్ అలీ హర్షం వ్యక్తం చేశారు.* ఇది రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా *అన్సర్ అలీ మాట్లాడుతూ* , విధి నిర్వహణలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న దాడులు, బెదిరింపులు మరియు అవమానాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ చట్టం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. న్యాయవాదుల భద్రత కోసం చిత్తశుద్ధితో వ్యవహరించిన *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మండలికి* ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. *బిల్లులోని కీలక అంశాలు మరియు శిక్షలు:* న్యాయవాదుల రక్షణ కోసం రూపొందించిన ఈ బిల్లులో పొందుపరిచిన ముఖ్యాంశాలను *అన్సర్ అలీ* ఈ సందర్భంగా వివరించారు: జైలు శిక్ష మరియు జరిమానా: న్యాయవాదులు లేదా వారి కుటుంబ సభ్యులపై హింసకు పాల్పడే వ్యక్తులకు 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. దీనితో పాటు ₹25,000 నుండి ₹50,000 వరకు జరిమానా కూడా విధిస్తారు. *ఆస్తుల నష్టపరిహారం:* న్యాయవాదుల ఆస్తులకు నష్టం కలిగిస్తే, సదరు నష్టాన్ని న్యాయస్థానం ద్వారా నిర్ధారించి, నిందితుల నుండి పరిహారం ఇప్పించే నిబంధన ఉంది. పోలీసుల బాధ్యత: ఏదైనా కారణం చేత న్యాయవాదిని అరెస్ట్ చేయాల్సి వస్తే, ఆ విషయాన్ని 24 గంటల్లోపు సంబంధిత బార్ కౌన్సిల్ లేదా బార్ అసోసియేషన్కు పోలీసులు తెలియజేయాల్సి ఉంటుంది. *వేగవంతమైన విచారణ:* న్యాయవాదులపై జరిగే దాడులకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేసేలా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. రక్షణ కవచం: కోర్టు విధుల్లో భాగంగా న్యాయవాదులు చేసే పనులపై ఉద్దేశపూర్వకంగా వేధించే ధోరణితో దాఖలయ్యే తప్పుడు కేసుల నుండి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. న్యాయవాదుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మరియు వారు నిర్భయంగా వృత్తిని కొనసాగించేందుకు ఈ చట్టం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని అన్సర్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల న్యాయవాద లోకం తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily