Wednesday, 04 March 2026 01:44:49 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పెద్దమ్మ గుడి ఆలయంలో పోతరాజు విగ్రహం ధ్వంసం

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 13 November 2025 08:26 AM Views : 274

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి నవంబర్ 12 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మాణం చేసిన స్టేషన్ రోడ్ లో గల ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ గుడి ఆలయం లో పోతరాజు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోతురాజు విగ్రహం విధ్వంసానికి పాల్పడిన వ్యక్తి ఉత్తరకాండ రాష్ట్రంలోని హరిద్వార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు స్థానికులు పేర్కొన్నారు వ్యక్తి మద్యం మత్తులో విగ్రహాన్ని ధ్వంసం చేశాడని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పొత్కపల్లి. ఎస్సై దికొండ రమేష్ విధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకొని స్టేషన్ కు తరలించినట్టు ఎస్ఐ పేర్కొన్నారు ఈ సందర్భంగా ముదిరాజ్ కుల సభ్యులు స్పందిస్తూ పెద్దమ్మ గుడి ఆలయంలో ఉన్న పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎంతో పవిత్రమైన ఆలయంలో ఇలాంటి సంఘటన జరగడం అని బాధాకరమని వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకొని ఇంకెప్పుడు హిందూ దేవాలయాల జోలికి రాకుండా శిక్షపడేల చూడాలని డిమాండ్ చేశారు ఆ వ్యక్తి ఎందుకు ఇక్కడికి వచ్చాడు దేనికోసం వచ్చాడు వచ్చిన వ్యక్తి కేవలం విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశాడు అనే దానిపై పూర్తిగా విచారణ చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో బాంబు పేలిన సంఘటన మర్చిపోకముందే మండలంలో ఇలాంటి విధ్వంసం చేయడం దేనికి సాంకేతమని ఇలాంటి వ్యక్తులను గుర్తించకపోతే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున దీనిపై సమగ్రమైన విచారణ జరిపించి దుండగుడిపై కఠిన చర్యలు చట్టరీత్యా శిక్ష పడే విధంగా చూడాలని కోరారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :