Wednesday, 04 March 2026 01:45:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి... టెండర్ కాంట్రాక్టర్లు నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి. రెబ్బవరం బిసి గురుకులంను సందర్శించిన... సిపిఐ(ఎం) వైరా

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 14 September 2025 08:15 PM Views : 568

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 14 వైరా (అక్షరంన్యూస్) రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం వైరా మండల పరిధిలోని రెబ్బవరం బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను భూక్యా వీరభద్రం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సొంత భవనం లేక అరకొర వసతులతో చదువులు సక్రమంగా చదవలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సొంత భావనం నిర్మాణానికి నిధులు కేటాయించి నిర్మించాలని కోరారు. కాంట్రాక్టర్లు గురుకులాలకు నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని, ఎలాంటి అవకతవకలు లేకుండా విద్యార్థులకు మెనూ ప్రకారం అన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతివారం గురుకులాలకు సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. విద్యార్థులతో మాట్లాడి వారు చెప్పిన సమస్యలను అక్కడి ప్రిన్సిపాల్, వార్డెన్, సంబంధించిన వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. బాలికలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వారికి నిపుణులైన వైద్యులతో సకాలంలో వైద్య సౌకర్యాలు అందే విధంగా చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి మెనూ ప్రకారం అన్ని అందించాలని సూచించారు. పేద విద్యార్థులు సక్రమంగా విద్య అందే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. క్రమశిక్షణతో శ్రద్ధగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని విద్యార్థినీలకు సూచించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :