GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / తెలంగాణ స్టేట్ బ్యూరో : అక్షరం ప్రతినిధి పోచంపాడు రేపటినుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేస్తున్నట్లు టి శ్రీనివాసరావు గుప్తా సూపరింటెంటింగ్ ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ పోచంపాడు తెలియజేశారు ఈ సందర్భంగా అక్షరం ప్రతినిధితో మాట్లాడుతూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోనీ వానాకాలం పంటకు సాగునీరు అందించే ప్రణాళిక పై తెలంగాణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో -రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశ (SCIWAM )నిర్ణయం ప్రకారం... ఈ నెల ఏడవ తారీఖు (07-08-2025) అనగా రేపటి నుండి కాకతీయ మరియు లక్ష్మీకాల్వలకు సాగు నీరు విడుదల ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది అని తెలిపారు రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు గుప్తా కోరారు
.
Aksharam Telugu Daily