GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/జనవరి 19/అక్షరం న్యూస్: మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ పెరుగుతుంది. ఓ వైపు అభివృద్ధికి తాము పెద్దపీట వేస్తున్నామని,హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో జమ్మికుంట పట్టణ సీనియర్ డాక్టర్ సురంజన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రణవ్.ఈ చేరికతో జమ్మికుంటలో కాంగ్రెస్ మరింత బలపడుతుంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని,ఇంచార్జిగా ప్రణవ్ ప్రజల్లో మమేకమవుతూ పార్టీని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేస్తున్నారని ఈ సందర్భంగా వారి నాయకత్వంలో పని చేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని డాక్టర్ సురంజన్ అన్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జమ్మికుంట,హుజూరాబాద్ మున్సిపల్ పీఠాలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని డాక్టర్ సురంజన్ అన్నారు.
.
Aksharam Telugu Daily