D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ/ఆగస్టు/ 29 (అక్షరంన్యూస్) కొనిజర్ల, వైరా, తల్లాడ ప్రాంతాల్లో గుంతల మయంగా మారిన రహదారులు మా ప్రాణాలు కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్చేస్తున్న వాహన దారులు... రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేనివిధంగా ఖమ్మం జిల్లాలో ప్రధాన శాఖలైన ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. కానీ ..అందుకు విరుద్ధంగా రోడ్లన్నీ అద్వానంగా మారిపోయాయి. ప్రధాన నగరాలకు కూడలిగా ఉన్న తల్లాడ రింగ్ రోడ్డు ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. వర్షాలతో పాటు స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో రింగురోడ్డు చుట్టూ ప్రమాదకరంగా మోకాల్లోతు గుంటలు పడ్డాయి. ఈ రోడ్డులో వాహనదారులు వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా ఆ గుంటల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులకు ఆ గుంతలు ఉన్నాయని తెలియక అందులో పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇంత జరుగుతున్నా మాత్రం స్థానిక అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదు. గతంలో ఎన్ని సార్లు ఈ రోడ్లపై అనేక కథనాలు వచ్చినప్పటికీ పట్టించుకున్న పాపాలు పోలేదు. జిల్లాకు లక్షలాది నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ తల్లాడ అధికారులు మాత్రం ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇలాగే ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తల్లాడ అధికారులపై చర్యలు తీసుకొని, ప్రధాన రహదారి రోడ్లకు మరమ్మత్తులు చేయించాలని ఈ ప్రాంత ప్రజలు మంత్రులను కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily