Monday, 28 April 2025 07:20:02 AM
 Breaking
     -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....      -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు పెద్దపీట. పోలీసులు ఎల్లవేళలా ఉండి ప్రజలకు సేవలు అందించాలి. -మంత్రి పొన్నం ప్రభాకర్.

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 11 March 2025 09:31 PM Views : 236

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మార్చి 11(అక్షరం న్యూస్ ) హుస్నాబాద్ పట్టణంలో ఆధునిక టెక్నాలజీ తో నూతనంగా నిర్మించిన హుస్నాబాద్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీపీ) కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎం.రమేష్, ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఐపిఎస్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి పోలీసులు ఎల్లవేళలా ఉండి సేవలు అందించాలని సూచించారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలి.బాధితులకు అండగా నిలవాలని సూచించారు.బాధితులు ఏదైనా సమస్య గురించి పోలీస్ స్టేషన్కు వస్తే హక్కున చేర్చుకుని సామరస్యంగా సమస్యలు పరిష్కరించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు. ఏసీపీ కార్యాలయం అద్భుతంగా నిర్మించడం జరిగిందన్నారు. రాబోవు రోజులలో పోలీసులు నూతన టెక్నాలజీ ఉపయోగించి విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. -ఎం.రమేష్ ఐపీఎస్ మాట్లాడుతూ. నూతనంగా నిర్మించిన ఏసీపీ కార్యాలయాన్ని మంత్రివర్యులుచే ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఈరోజు నుండి ఈ కార్యాలయం నుండి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఏ సమస్యలు ఉన్న నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, చేర్యాల సీఐ శ్రీను, హుస్నాబాద్ డివిజన్ ఎస్ఐలు, స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :