Friday, 14 November 2025 01:29:57 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎన్నాళ్ళు ఎన్నేళ్లు*... *12 ఏళ్లయినా నీటి సరఫరా లేదు*.. *ఉత్సవ విగ్రహం లామారిన మల్లవరం వాటర్ ట్యాంక్...*, *12 లక్షలు వృధా*

నీరు విడుదల చేస్తే పైపులు పగిలిపోతున్నాయి*.. *అంత నాణ్యమైన పైపులు వేశారా*, *ట్యాంక్ పైకి ఎక్కటానికి* *ఏర్పాటు చేస్తా మెట్లు* *పగిలిపోవడంతో* *మంచం కోళ్లు అడ్డం పెట్టారు*, *ఇది నాణ్యతా ప్రమాణాలతో కట్టిన వాటర్ ట్యాంక్*.. *మల్లవరం గ్రామంలో నీటి ఎద్దడి*..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 18 March 2025 12:16 PM Views : 1110

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ మార్చి తల్లాడ/ 18 (అక్షరంన్యూస్)* నీటి ఎద్దడిని తీర్చాలని 12 సంవత్సరాల క్రితం 12 లక్షల రూపాయల వ్యయంతో ట్యాంకు నిర్మించారు, నీళ్లు వదిలితే పైపులు పగిలిపోతున్నాయని, నీటిని నింపటమే వదిలేశారు, గ్రామస్తులు ట్యాంక్ పూర్తయింది కదా తమ బాధలు తొలగిపోతాయని ఆశించారు వారి ఆశలు అడియాసలే అయ్యాయి, గత 12 ఏళ్లుగా నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూడడమే వారికి మిగిలింది. గ్రామంలో రెండు బావులు ఉన్నాయి, ఒక భావిద్వారా గ్రామంలో నీటి సరఫరా జరిగేది భావి చుట్టూ కాంగ్రెస్ చేయడం తో నీటి జలలు తిరిగిపోయాయి, నీటి నిల్వ లేకుండా పోయింది, అధికారులు పర్సంటేజీ ల కోసం కాంక్రీట్ చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు, మరొక బావి ఉంది దాన్ని నిండా నీళ్లు ఉంటాయి కానీ ఆ బావికి మోటర్లు అమర్చి గ్రామంలో నీటిని సరఫరా చేయొచ్చు, కానీ గ్రామస్తులు ఎన్నిసార్లు మొత్తుకున్నా అధికారులు స్పందించడం లేదు ఆ బావికి మోటర్లు అమర్చి నీటిని సరఫరా చేయడం లేదు, ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బావికి మోటర్లు అమర్చి గ్రామంలో నీటి సరఫరా చేయాలని, వాటర్ ట్యాంక్ ద్వారా గ్రామస్తులకు నీళ్లు అందించాలని వేసవి ఎద్దడిని గుర్తించి ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :