AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా /బూర్గంపాడు మండలం /సారపాక. అక్షరం న్యూస్/ జులై 25: గిరిజన చిన్నారుల విద్యను బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని, ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకొని పిల్లలు తెలుగు, ఇంగ్లీషులో రాసే పదాలు తప్పులు లేకుండా సక్రమంగా రాసేలా చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం నాడు బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని భాస్కర్ నగర్, రాజీవ్ నగర్ గిరిజన సంక్షేమ శాఖ జిపిఎస్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఉపాధ్యాయుడి పాత్ర నిర్వహించి పిల్లల చేత బోర్డుపై అక్షరమాల మరియు వారి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఎలా రాయాలో పిల్లల చేత రాయించి పిల్లలు అడిగిన ప్రతి పదాలను బోర్డుపై రాయడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిపిఎస్ పాఠశాలలో చదివే పిల్లల యొక్క విద్యాభ్యాసం పునాది నుండి పటిష్టంగా ఉండేలా ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని చాలా వరకు పిల్లలు అందులోని పదాలు, కూడికలు, తీసివేతలు ఇతర వస్తువుల యొక్క పేర్లు అర్థం చేసుకొని రాయగలుగుతున్నారని, అయినా ఇంగ్లీషులోని పదాలు అక్కడక్కడ తప్పులు రాస్తున్నారని అందుకు అక్షరమాలకు సంబంధించిన అక్షరాలు పిల్లలందరూ తప్పులు లేకుండా రాసేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిల్లలకు నేర్పించాలని, సంబంధిత ఎస్ సి ఆర్ పి ల పర్యవేక్షణ సక్రమంగా ఉండాలని, ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు ఉపాధ్యాయులు పిల్లలకు బోధిస్తున్నది లేనిది గమనించాలని, పిల్లలకు ఏ విధంగా బోధిస్తున్నది పరిశీలించాలని అన్నారు. అలాగే ఉద్దీపకం వర్క్ బుక్స్-2 వర్క్ బుక్ ప్రతి జిపిఎస్ పాఠశాలకు పంపిణీ చేసినందున ఉపాధ్యాయులు తప్పనిసరిగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వారికి బోధించి పిల్లలందరూ చదవడం రాయడం వచ్చే విధంగా చూడాలని అన్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఇంగ్లీషు గణితం కు సంబంధించిన ఉద్దీపకం వరకు బుక్స్-2 లోని అంశాలు పిల్లల చేత రాయించాలని అన్నారు. భాగ్యనగర్ జిపిఎస్ పాఠశాలలో 50 మంది పిల్లలు ఉన్న అక్కడ పనిచేస్తున్న టీచర్ రాజ్యలక్ష్మి ఎంతో క్రమశిక్షణగా పిల్లలకు ఉద్దీపకం వర్క్ బుక్ లోని పదాలు అర్థమయ్యే రీతిలో బోధించి పిల్లలు వర్క్ బుక్ లోని అంశాలు తప్పులు లేకుండా బోర్డుపై రాసి వాటి అర్ధాలు అనర్గళంగా చెప్పడంతో టీచర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి ఆర్ పి శ్రీదేవి మరియు ఉపాధ్యాయునిలు మంగమ్మ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily