Sunday, 29 March 2026 03:29:59 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రేపటి నుండి పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రారంభం 6 కేంద్రాల్లో నామినేషన్ లు స్వీకరణ – ఎంపీడీఓ లచ్చాలు

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 02 December 2025 03:43 PM Views : 583

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/డిసెంబర్-03(అక్షరం న్యూస్) మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ముస్తాబాద్ మండల లము లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంపీడీఓ లచ్చాలు తెలిపారు. . ముస్తాబాద్ మండల వ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల నుండి నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు సిద్దం చేశామని అన్నారు. ఆయా పంచాయితీ కార్యాలయాల్లో అభ్యర్ధుల నుండి నామినేషన్ స్వీకరిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.5వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.మొదటి క్లస్టర్ గూడెం గ్రామం లో గూడెం, అవునూర్, తూర్కపల్లి రామలక్ష్మణ పల్లి, రెండొవ క్లస్టర్ నామపూర్ లో నామపూర్, గోపాలపల్లి, రాంరెడ్డి పల్లి, కొండాపూర్, మూడోవ క్లస్టర్ చీకోడ్ లో చీకోడ్, చిప్పల పల్లి, మొఱ్ఱయి పల్లి, నాలుగోవ క్లస్టర్ ముస్తాబాద్ లో ముస్తాబాద్, మోహిని కుంట, మద్దికుంట, ఐదోవ క్లస్టర్ బంధానకల్ లో బంధానకల్, వేంకట్రావు పల్లి, తెర్లుమద్ది, మొఱ్ఱపూర్, ఆరోవ క్లస్టర్ గా పోతుగల్ లో పోతుగల్, సేవాలాల్ తండా, గన్నేవారి పల్లి, గూడూరు,గ్రామాలు ఆయా పంచాయితీ కార్యాలయాల్లో అభ్యర్ధుల నుండి నామినేషన్ స్వీకరిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.బుధవారం ఉదయం 10.30 నిమిషాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందని,సాయంత్రం 5గంటలకు పూర్తి అవుతుంది అని తెలిపారు. అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే స్వీకరణ కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. నామినేషన కేంద్రాలకు 100మీటర్ల దూరంలో వాహనాలను నిలపాలని, సూచించారు.నామినేషన్‌ కేంద్రం వద్ద వంద మీటర్ల పాటు నిషేధాజ్ఞలు అమలవుతాయన్నారు. నామినేషన్‌ ప్రక్రియ నాటి నుంచి45రోజుల లోపు అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :