Saturday, 18 April 2026 06:44:08 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అవకాశాలను సద్వినియోగ పర్చుకొండి వనవాసి ప్రాంత సహ మహిళా ప్రముఖ్ ఆశాలత

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 02 September 2025 06:35 PM Views : 563

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల సెప్టెంబర్ 2/ అక్షరం న్యూస్ ---- దాతల ద్వారా అందివస్తున్న అవకాశాలను సద్వినియోగ పరుచుకోవాలని వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత అన్నారు. చర్ల కు చెందిన బంగారం దుకాణం యజమాని గాదంశెట్టి నరసింహారావు తన మాతృమూర్తి గాందశెట్టి చెంచులక్ష్మి వర్దంతి సందర్భంగా వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం కు 50 కేజీల బియ్యం వితరణ గా అందచేసి నిలయ విద్యార్థులకు ఒకపూట భోజనం పండ్లను పంపిణీ చేసారు. దాతలు గత కొద్ది సంవత్సరములు గా గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ వస్తున్నారు.దాతలకు నిలయ కమిటీ సభ్యులు హృదయ పూర్వకమైన కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆశాలత మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతి కొరకు దాతలు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. పేద విద్యార్దుల చదువుల కొరకు వారికి బంగారు భవిష్యత్ అందచేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతుగా సహకారం అందించడం నిలయ కమిటీలో ఉత్సాహం నింపుతోందని వెల్లడించారు. విద్యార్దులు దాతల నమ్మకాన్ని వమ్ముచేయకుండా క్రమశిక్షణతో చదివి సంస్ద తో పాటు తల్లిదండ్రులు గ్రామానికి పేరుప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. విద్యార్ది దశలో కష్డపడితే జీవితాంతం సుఖపడతారన్న విషయాన్ని గమనంలో కి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ, ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :