GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/రఘునాథపల్లి : జనగామ జిల్లా/ రఘునాథపల్లి/( అక్షరం న్యూస్ ) సెప్టెంబర్ 05: మండల కేంద్రంలోని మిత్ర కాలనీ గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన లడ్డు లక్కీ డ్రాను శుక్రవారం స్థానిక ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్ చేతుల మీదుగా నిర్వహించగా లడ్డును కొలుపుల మధుజ దక్కించుకున్నారు. అదేవిధంగా విగ్నేశ్వరుని పట్టు పంచను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు దక్కించుకోగా మండపం వద్ద ఏర్పాటు చేసిన పుస్తకాలు,పెన్నులు తదితర వస్తువులను కూడా డ్రాలో వేయగా సోమ వెంకటరమణ,నునావత్ అంజయ్యలు మరికొందరు గెలుచుకున్నారు.ఈ డ్రాలో మొత్తం 111 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై చేతుల మీదుగా లడ్డును విజేత కుటుంబ సభ్యులు కొలుపుల రవి స్వరాజ్యంలకు మిత్ర కాలనీ సభ్యులు అందజేశారు. అలాగే గుండా వినయ్ వర్షిని,కొన్నే సతీష్ రమ, సూర సుధాకర్ కల్పన,సింగారం గణేష్ సంధ్య,తాటి రవి ప్రత్యూష,విగ్రహ దాత కరిమికొండ వెంకటేశ్వర్లు లక్ష్మి,తదితర కుటుంబ సభ్యులను ఎస్సై శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా ఎస్ఐని కూడా మండపం నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మిత్ర కాలనీవాసులు బెల్దే లచ్చన్న లలిత,మల్కాపురం సంధ్య తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily