Wednesday, 04 March 2026 01:39:52 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కల్లూరు ఆశ్రమ పాఠశాలలో మరోసారి విద్యార్థినిలు అస్వస్థత... ఉదయం జీరా రైస్ తిన్న 12 మంది విద్యార్థినిలు ఒక్కసారిగా కడుపులో నొప్పి,విరోచనాలతో బాధపడు

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 17 August 2025 09:32 PM Views : 656

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ కల్లూరు/ఆగస్టు/17 ఖమ్మం జిల్లా కల్లూరు లోని ఆశ్రమ పాఠశాలలో మరోసారి విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం జీరా రైస్ తిన్న 12 మంది విద్యార్థినిలు ఒక్కసారిగా కడుపులో నొప్పి,విరోచనాలతో బాధపడుతూ ఉండటంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే 15 రోజుల వ్యవధిలో మూడుసార్లు 50 మందికి పైగా విద్యార్థినిలు అస్వస్థకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల ఐదవ తేదీన ఆశ్రమ హాస్టల్ లో అల్పాహారం తిన్న 37 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. తరువాత రోజు పదిమంది విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు.ఈ ఘటనకు సంబంధించి ఐటీడీఏ పీవో సదరు హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేశారు.ఘటన జరిగిన 12 రోజులు గడవక ముందే మరోసారి పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే రాగమయి, అడిషనల్ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితర ఉన్నతాధికారులు హాస్టల్ ను పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలను సైతం హాస్టల్ సిబ్బంది పట్టించుకోకపోవడం వలన మరోసారి విద్యార్థిని లు అనారోగ్యానికి గురయ్యారని విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు భూక్యా జ్యోతి, తాసిల్దార్ పులి సాంబశివుడు, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజా దేవి, హెచ్ఎం శ్రీనివాసరావు తదితరులున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :