Monday, 02 March 2026 09:33:19 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి

ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 26 February 2026 03:05 PM Views : 185

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : - 2014-15 నుండి భారతదేశం పెట్రోల్ ప్రత్యామ్నాయం ఇతనాల్ ద్వారా రూ.1.40 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ పంపుల్లో కొత్త రూల్ ఫిబ్రవరి 17న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌లో 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చమురు కంపెనీలు 20 శాతం వరకు ఇథనాల్-బ్లెండెడ్ మోటార్ స్పిరిట్(పెట్రోల్)ను విక్రయించాలి. మినిమం రిసెర్చ్ ఆక్టేన్ నెంబర్ (RON) 95 కలిగిన పెట్రోల్ ఉండాలి.' అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక పరిస్థితులలో నిర్దిష్ట ప్రాంతాలకు, అంతేకాకుండా పరిమిత సమయం వరకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపులను అనుమతించేందుకు అవకాశం ఉంది. ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న లేదా ఇతర ధాన్యం నుండి తయారు చేస్తారు. ఇది పునరుత్పాదకమైనది, దేశీయంగా ఉత్పత్తి చేయవచ్చు. పెట్రోల్ కంటే ఇది తక్కువ కాలుష్యానికి కారణం అవుతుంది. చమురు దిగుమతులను తగ్గించడంలో సహాయపడటానికి, కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం ఇథనాల్‌ను తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం రైతులకు కూడా మేలు చేయనుంది. 2023-2025 నుండి భారతదేశంలో తయారయ్యే చాలా వాహనాలు ఈ20 ఆధారంగా నడిచేలా రూపొందించారు. పెద్ద సమస్యలు ఏవీ ఉండవని అధికారులు చెబుతున్నారు. అయితే పాత వాహనాల మైలేజీలో స్వల్పంగా తగ్గుదల ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే.. ఇంజిన్ దెబ్బతినకుండా ఉండేందుకు కనీసం RON 95 కలపాలని కేంద్రం నిబంధన విధించింది. మినిమం రీసెర్చ్ ఆక్టేన్ నంబర్(RON) ఇంజిన్ నాకింగ్ (ప్రీ-ఇగ్నిషన్)కు ఇంధనంతో ఎంతవరకు తట్టుకుంటుందో తెలియజేస్తుంది. ఇంజిన్ లోపల ఇంధనం అసమానంగా మండినప్పుడు నాకింగ్ జరుగుతుంది. RON ఎంత ఎక్కువగా ఉంటే ఇంధనం నాక్ చేయడానికి అంత ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది. అంటే అధిక ఒత్తిడిలోనూ ఇంధనం స్థిరంగా ఉంటుంది. ఇథనాల్ సహజంగానే అధిక ఆక్టేన్ విలువను కలిగి ఉంటుంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం వల్ల నాకింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. జూన్ 2022లో భారతదేశం పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే అనుకున్నదానికంటే ఐదు నెలల ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకుంది. దీనితో ప్రభుత్వం 2030 నుండి 2026కి 20 శాతం బ్లెండింగ్‌ టార్గెట్‌ను సెట్ చేసింది. దేశంలోని చాలా పెట్రోల్ పంపులు ఇప్పుడు ఈ20 లేదా 20 శాతం ఇథనాల్‌తో కలిపిన పెట్రోల్‌ను విక్రయిస్తున్నాయి. కేంద్రం ప్రకారం, 2014-15 నుండి భారతదేశం పెట్రోల్ ప్రత్యామ్నాయం ద్వారా రూ.1.40 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసింది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :