Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి ఏప్రిల్ 21 (అక్షరం న్యూస్) గత కొద్దిరోజులుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తు పత్రాలను ఎంపీడీవో కార్యాలయం లో ఇవ్వగలరు అని ఎంపీడీవో జి తిరుపతి ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ చేసుకున్న దరఖాస్తు ఫారాలతోటి ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధ్రువీకరణ పత్రం ఆదాయ ధ్రువీకరణ పత్రం మరియు ఏదైనా రంగంలో ప్రావీణ్యం ఉన్న సర్టిఫికెట్లు మరియు ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో సహా మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 12 గంటలకు అందజేయగలరని ఎంపీడీవో జి తిరుపతి తెలియజేశారు
.
Aksharam Telugu Daily