Saturday, 22 November 2025 11:08:49 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

డబ్ల్యూజేఐ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన కేంద్రమంత్రి బండి సంజయ్


GUDIKANDULA DASU , MANDAL REPORTER, CHIGURUMAMIDI, KARIMNAGAR.

Reporter

Date : 19 November 2025 02:00 PM Views : 138

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / చిగురు మామిడి : సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టుల నిరంతర శ్రమ ప్రశంస నీయమైనదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇటీవలే ఎన్నికైన బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. కార్యవర్గ సభ్యులందరినీ శాలువాలతో సత్కరించారు.డబ్ల్యూజేఐ జిల్లా అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం కేంద్ర మంత్రిని ఆయన నివాస గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియా నిజాలను నిర్భయంగా వెలికి తీయాలని, పూర్తి స్వతంత్రతతో పనిచేయాలని అన్నారు. జర్నలిస్టులు సమాజంలో నెలకొన్న సమస్యలను వెలికి తీసి సమాజాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని కేంద్రమంత్రికి డబ్ల్యూజెఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి సత్యనారాయణ పరిచయం చేశారు.అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డి, ఉపాధ్యక్షులుగా మొగురం రమేష్,నర్సరీ కేదారి,ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్ , మహిళ కార్యదర్శి లావణ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులు రవీందర్, జి రమేష్, సంయుక్త కార్యదర్శి బూర్ల వెంకటేష్, కోశాధికారి చిటుమల్ల మహేందర్ కార్యవర్గ సభ్యులు జి రామకృష్ణ, కంది శ్రీనివాసరెడ్డి, పి సంతోష్ గౌడ్,జాలి నరేష్, కస్తూరి ప్రభాకర్, గంగం రాజు, కే రవీంద్ర చారి,సిహెచ్ వెంకటేష్, కే కుమార్, గుడికందుల దాసు తదితరులను కేంద్రమంత్రి ఘనంగా సన్మానించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :