Wednesday, 01 April 2026 03:15:50 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

దొంగతనాలను నిరోధించే అలారం తాళం ఏర్పటు చేసుకోవాలి ఎస్ ఐ గణేష్

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 30 March 2026 03:09 PM Views : 566

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /మార్చి -30(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండల పరిధిలో ని గ్రామాలలో మీ ఇంట్లో, గ్రామం లో ఉన్న ఆలయాల్లో దొంగలు పడకుండా నిరోధించేందుకు యాంటీ థెఫ్ట్ అలారం తాళాలు వేయాలని ముస్తాబాద్ ఎస్ ఐ గణేష్ సూచించారు. సోమవారం ముస్తాబాద్ మండలం తెర్లు మద్ది గ్రామం లో గ్రామ సర్పంచ్ బైతి దుర్గమ్మ -నవీన్ గ్రామం లో ఉన్న 8 ఇతర, కుల. సంఘాల దేవాలయాలకు సర్పంచ్ స్వంత నిధుల తో ఒక్కొకటి రూ. 800రూపాయల విలువ గల స్మార్ట్ యాంటీ థెఫ్ట్ అలారం తాళాల ఏర్పాటు చేయడం తో వాటిని ఎస్ ఐ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ గ్రామాలలో ఇంటి తలుపులు,ఆలయలకు, కిటికీలకు స్మార్ట్ యాంటీ థెఫ్ట్ అలారం తాళం వేస్తే చాలు దొంగలు వాటిని తెరిచేందుకు యత్నిస్తే మాగ్నటిక్ సెన్సార్ల సహాయంతో అలారం మోగుతుందని, దొంగలు ఈ తాళాన్ని పగుల గొట్టేందుకు యత్నిస్తే 105 నుంచి 110 డెసిబుల్ శబ్దాలతో అలారం మోగిస్తూ నివాసితులతోపాటు చుట్టుపక్కల గృహాల వారిని అప్రమత్తం చేస్తుంది.అని తెలిపారు ఈ అధునాతన తాళాల సహాయంతో దొంగతనాలను నియంత్రించవచ్చని తెలిపారు.ఆస్తి నేరాలు జరగకుండా అందరూ అలారం తాళం ఏర్పాటు pచేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ ఐ తో పాటు గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :