D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 12 తల్లాడ (అక్షరంన్యూస్) సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించిన తల్లాడ మండల కమిటీ ఈ సందర్భంగా మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ దేశంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా 26 రాజకీయ పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాటు చేయటంలో కీలకపాత్ర వహించి దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ వేదికను పరిచయం చేసిన గొప్ప మేధావి అని అన్నారు. సీతారాం ఏచూరి మన మధ్య లేకపోవడం ఈరోజు పార్టీకి దేశానికి తీరని లోటు అని అన్నారు ఏచూరి నమ్మిన సిద్ధాంతానికి మనకిచ్చిన విధానాలను ముందుకు తీసుకోవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు నల్లమోతు మోహన్ రావు చల్లా నాగేశ్వరరావు షేక్ మస్తాన్ పారసాని రాజేశ్వరరావు కామినేని కృష్ణయ్య షేక్ బాజీ కోడూరు నరసింహారావు గణేష్ రాములు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily