GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : * కరీంనగర్/జమ్మికుంట/జనవరి 10/అక్షరం న్యూస్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) జమ్మికుంట పట్టణ అభివృద్ధికై, నాయిని చెరువు రిజర్వాయర్ కోసం అనేక ఉద్యమాలు చేసి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేడలు వంచి అభివృద్ధి సాధించడంలో బిజెపి పార్టీ మొదటి వరుసలో ఉందని పట్టణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆకుల రాజేందర్ మాట్లాడుతూ పట్టణంలోని నాయిని చెరువు 290 ఎకరాలు ఉన్నప్పటికీ, రిజర్వాయర్ పేరుతో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించి ఇటు పట్టణ ప్రజల కు అహ్లాదకరమైన వాతావరణ ఉండేలా పార్కు, వాకింగ్ ట్రాక్, బతుకమ్మ ఘాట్, చెరువు లోపల బోటింగ్ తో పాటు ఆబాధి జమ్మికుంట , మాచనపల్లి, మోత్కులగూడెం తోపాటు పట్టణ ప్రజలకు వ్యవసాయలకు సమృద్ధిగా పంటలు పండించే విధంగా నీరు నిల్వ ఉండేలా తయారు చేసి అందుబాటులో ఉంచాలని ఉద్దేశంతో బిజెపి పార్టీ పనిచేస్తుందని ఆకుల రాజేందర్ అన్నారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో నాయిని చెరువుని పర్యాటక కేంద్రంగా మారుస్తూ, బోటింగ్ (పడవలో ప్రయాణం చేసే విధంగా) ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఆకుల రాజేందర్ అన్నారు.
.
Aksharam Telugu Daily