GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/జనవరి 18/అక్షరం న్యూస్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జమ్మికుంట పట్టణంలోని 24వ వార్డు నుంచి తెలంగాణ జనసమితి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని పార్టీ రాష్ట్ర నాయకురాలు అరికిల్ల స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. వార్డు ప్రజలు ఆశీర్వదించి ఒక అవకాశం కల్పిస్తే, 24వ వార్డు రూపురేఖలు మార్చి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా మహిళా అభ్యర్థిగా బరిలో నిలిచి, ప్రజల విశ్వాసంతో గెలిస్తే నిస్వార్థంగా ప్రజా సేవ చేయడమే నా లక్ష్యమని స్పష్టం చేశారు. 24వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, మహిళలు–యువత సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా విజయం సాధించి, నాయకురాలిగా కాదు – సేవకురాలిగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.పైసల ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా, నిజాయితీగా, పారదర్శకంగా ప్రజా సేవ చేయడానికే పూర్తి సమయం కేటాయిస్తానని ఈ సందర్భంగా అరికిల్ల స్రవంతి పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily