P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ఓదెల/ పెద్దపల్లి మార్చి 28 (అక్షరం న్యూస్ ) *ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఒక బాధ్యతగా పాటించాలని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా శనివారం కనగర్తి గ్రామంలో రోడ్డు భద్రత మహోత్సవం కార్యక్రమం గ్రామస్తులతో రాలి నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై దికొండ రమేష్ మాట్లాడుతూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి మరియు వాహనదారుల్లో క్రమశిక్షణను పెంపొందించడానికి పోత్కపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో 'ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఒక బాధ్యతగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాహనదారులకు ఈ క్రింది కీలక సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్*: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. *మైనర్ డ్రైవింగ్* : తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ఇది చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. *మద్యం సేవించి వాహనం నడపరాదు*: మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు వర్ణనాతీతమని మద్యం సేవించి బండి నడపడం వల్ల తమ విలువైన ప్రాణాలను కోల్పోవడం వస్తుందని తనపై ఆధారపడ్డ కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడుతుందని గమనించి వీటిని పాటించాలని అన్నారు ట్రిపుల్ రైడింగ్ బైక్లపై ముగ్గురు ప్రయాణించడం ప్రమాదకరమని, అటువంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కేవలం పోలీసులు మాత్రమే కాకుండా, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రెడ్డి రజనీకాంత్ తో పాటు పలువురు నాయకులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily