Monday, 02 March 2026 09:34:11 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా క్రాంతి కళాశాలలో ఘనంగా" వీడ్కోలు సభ ..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 21 February 2026 01:52 PM Views : 88

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం అక్షరం ఫిబ్రవరి 20 వైరా వైరా స్థానిక ఎస్ ఆర్ ఠాగూర్ విద్యా సంస్థలైన క్రాంతి జూనియర్ కళాశాల లో మొదటి సంవత్సరం విద్యార్థులు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ గలిగి సేవాభావం కలిగి అంకిత భావంతో చదువుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పరోక్షంగా దేశ అభివృద్ధికి శాస్త్రీయ పద్ధతిలో తోడ్పడాలని,. ప్రపంచ దేశాల విద్య అవకాశాలను వినియోగించు కొని ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీని తట్టుకోవాలని, ఆ రకంగా మీ తల్లిదండ్రులు మంచి పేరు తేవాలనిఅభిప్రాయపడ్డారు. అనంతరం మొదటి సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, ఎన్ఎస్ఎస్ రెగ్యులర్ కార్యక్రమాలలో చొరవ చూపిన విద్యార్థులకు, ఆటలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు, ముగ్గుల పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత బహుమతి ప్రధానోత్సవం చేశారు. అనంతరం విద్యార్థులు ఆట పాట నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ లింగారావు, మజీద్, వేణు, నాగలక్ష్మి, చైతన్య, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :