D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 11 (అక్షరంన్యూస్) వర్ధమాన రచయిత నరేష్ జిల్లా రచించిన ‘విత్తనం నుండి మహావృక్షంగా వనజీవి జీవితం’ పుస్తకావిష్కరణ, పరిచయ సభ ఈ నెల 14న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఖమ్మంలోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో జరుగుతుందని అక్షరాల తోవ నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వనజీవి రామయ్య జీవిత చరిను నరేష్ జిల్లా పుస్తకంగా మలిచినట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ కవి, కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్ సీతారాం పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ప్రముఖ రచయిత, విమర్శకులు సైదులు ఐనాల, ప్రముఖ రచయిత్రి వురిమళ్ల సునంద, ప్రముఖ సామాజిక వేత్త కడవెంటి వేణుగోపాల్, ప్రముఖ రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణులు అట్లూరి వెంకటరమణ, ప్రముఖ కవి నయీమ్ పాషా, ఆక్స్ఫర్డ్ హైస్కూల్ కరెస్పాండెంట్ ఎం.డి జాఫర్ మతీన్, వనజీవి రామయ్య సతీమణి జానకమ్మ పాల్గొనున్నట్లు తెలిపారు. జిల్లాలోని కవులు, రచయితలు, సాహితీవేత్తలు, సాహిత్యాభిలాషులు, సాహిత్య పోషకులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
.
Aksharam Telugu Daily