AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 21/ అక్షరం న్యూస్/--- గిరిజనుల అభ్యున్నతి కొరకే వనవాసీ కళ్యాణ పరిషత్ ఏర్పాటయిందని సంస్ద జిల్లా సంఘటనా కార్యదర్శి కోరం సూర్యనారాయణ అన్నారు. చర్ల మండలం మొగళ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి యాలం నవిత తిరుపతి ల కుమార్తె దర్శిక ద్విజ జన్మదినం సందర్భంగా వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం కు 25 కేజీల బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులను అందచేసారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సూర్యనారాయణ మాట్లాడారు. దేశ వ్యాప్తంతగా ఉన్న గిరిజనులలో చైతన్యం నింపేందుకు వనవాసీ సేవలను అందచేస్తున్నట్లు వివరించారు.గిరిజన విద్యార్దులకు విద్యను అదించేందుకు దేశ వ్యాప్తంతగా 526 రాష్ట్రాలలో వనవాసీ విద్యార్ది నిలయాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఛత్తీస్ఘడ్ లోని జస్ పూర్ లో ఏడుగురు విద్యార్థులతో ప్రారంభమైన సంస్ద నేడు దేశ వ్యాపితంగా 256 విద్యార్ది నిలయాలను ఏర్పాటు చేసి వేలాదిమంది విద్యార్దులకు విద్యను అందిస్తుందని వెల్లడించారు. ఇందుకు గాని గిరిజన అభ్యన్నతి కొరకు ఏడు లక్షల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా తమ సేవలను అందచేస్తున్నారని వివరించారు. పంచాయతీ కార్యదర్శి యాలం నవిత మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి కొరకు సంస్ద చేస్తున్న సేవలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు. విద్యతో పాటు జాతీయ భావం, దేశభక్తి పెంపొందించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇక్కడి విద్యార్దుల నడవడిక క్రమ శిక్షణ తమను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. విద్యార్దులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగ పరుచుకొని చదువుపై శ్రద్ద వహించడం ద్వారా ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్ది నిలయం పేద గిరిజన విద్యార్దులకు అందింస్తున్న సేవలను గుర్తించి దాతలు సహకారం అందించడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్దుల చదువులకు సహకరించేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. విద్యార్ది నిలయం కు బియ్యం కూరగాయలు అందచేసిన దాతలకు నిలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమంలో నిలయ కమిటీ ఉపాద్యక్షులు గోగికార్ రామలక్ష్మణ్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily